Double Ismart : పూరి, రామ్‌ల డబల్‌ఇస్మార్ట్‌ !

0


పూరీజగన్నాధ్‌, రామ్‌ పోతినేని కాంబోలో వచ్చిన 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి ఇద్దరి కెరీర్‌కి బూస్ట్‌ ఇచ్చింది. అప్పటిదాకా లవర్‌ బాయ్‌ల అకనిపించిన రామ్‌ ఈ సినిమాతో పూర్తిగా మాస్‌ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ భారీ విజయం సాధించి కలెక్షన్స్‌ కూడా బాగా రాబట్టింది. అయితే ఇదే కాంబినేషన్‌ లో ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తాయి అని గతంలో వార్తలు వచ్చాయి. పూరి లైగర్‌తో భారీ దెబ్బ తినడంతో ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌ ని అనౌన్స్‌ చేశాడు ఇటీవల. డబల్‌ ఇస్మార్ట్‌ అనే టైటిల్‌ ప్రకటించి 8 మార్చ్‌ 2024 లో రిలీజ్‌ చేస్తామని కూడా డేట్‌ ప్రకటించాడు పూరి. తాజాగా నేడు ఈ డబల్‌ ఇస్మార్ట్‌ నుంచి అప్డేట్‌ ఇచ్చారు. నేడు డబల్‌ ఇస్మార్ట్‌ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్‌, రామ్‌, ఛార్మి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు చిత్రయూనిట్‌. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కి వెళ్తున్నట్టు సమాచారం. ప్రఖ్యాత సంగీత స్వరకర్త మణిశర్మ ఈ ప్రాజెక్ట్‌కు తన సంతకాన్ని జోడిరచి, సినిమా సౌండ్‌ట్రాక్‌కి బాధ్యత వహిస్తారు. మిగిలిన నటీనటులు మరియు సిబ్బంది విషయానికొస్తే, ప్రస్తుతానికి అదనపు వివరాలు ఏవీ వెల్లడిరచలేదు. మొదటి భాగం నుండి ప్రధాన నటీమణులు అయిన నిధి అగర్వాల్‌ మరియు నభా నటేష్‌ ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను పునరావృతం చేస్తారా అనే వార్తలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి భాగస్వామ్యం అనిశ్చితంగానే ఉన్నప్పటికీ, పూరీ జగన్నాధ్‌ మరియు రామ్‌ పోతినేని మధ్య సహకారం నిస్సందేహంగా సినీ ఔత్సాహికులలో ఉత్సాహానికి కారణం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !