DR BS Rao Passes Away : బాలికల కోసం ఏకంగా విద్యాసంస్థనే స్థాపించిన బిఎస్‌.రావు !

0

డాక్టర్‌ బీఎస్‌ రావు.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆసలు పేరు బొప్పన సత్యనారాయణరావు. శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులుగా సుపరిచితులు. వృత్తిరీత్యా వైద్యుడే అయినా.. ప్రవృత్తిపరంగా విద్యావేత్త. వైద్యులుగా బీఎస్‌ రావు, రaాన్సీ లక్ష్మీభాయి  దంపతులు విశేష సేవలందించారు. విదేశాల్లో పేరుమోసిన డాక్టర్లుగా కీర్తిగడిరచారు. కుమార్తెలను భారత్‌లో చదివించాలన్న ఆలోచనతో అన్ని వసతులున్న కాలేజీల కోసం ఆరాతీశారు. ఎన్నోచోట్ల తిరిగిన సంతృప్తి చెందలేదు. ఈ అన్వేషణలో భాగంగా పురుడుబోసుకున్నవే చైతన్య విద్యాసంస్థలు. 1986లో విజయవాడలో 86 మంది విద్యార్థినులతో బాలికల జూనియర్‌ కాలేజీ ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, మంచి ఫలితాలతో అందరి ప్రసంశలు అందుకున్నారు. ఇంతింతై వటుడిరతై అన్నట్టు అనతికాలంలోనే శ్రీచైతన్య విద్యాసంస్థలు తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాయి.  ప్రస్తుతం శ్రీచైతన్య సంస్థల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 

నేపథ్యం 

డాక్టర్‌ బీఎస్‌ రావుది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామం. సామాన్య రైతు కుటుంబం. ప్రాథమిక స్థాయి నుంచే బీఎస్‌ రావు చదువు అంటే ఆసక్తి. ఎస్‌ఎస్‌ఎల్సీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ చదివారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో వైద్య కోర్సును పూర్తిచేశారు. ఎంబీబీఎస్‌ అనంతరం డాక్టర్‌ బీఎస్‌ రావుగా సుపరిచితులయ్యారు. లండన్‌ లో ఎంఆర్‌ హెచ్‌ఎస్‌ ను పూర్తిచేశారు. 1971లో డాక్టర్‌ రaాన్సీ లక్ష్మీభాయిని వివాహం చేసుకున్నారు. ఇంగ్లండ్‌, ఇరాన్‌ లో 15 సంవత్సరాల పాటు దంపతులు వైద్యసేవలందించారు. ఈ సంస్థ ప్రస్తుతం 321 జూనియర్‌ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్‌ఈ స్కూళ్లతో విజయవంతంగా నడుస్తోంది. అయితే పదేళ్ల కిందటే చైతన్య విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతల నుంచి బీఎస్‌ రావు తప్పుకున్నారు. తన ఇద్దరు కుమార్తు సుష్మ, సీమకు అప్పగించారు.

ప్రముఖుల సంతాపం 

తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగానిఇ విశేష సేవలందించిన ఘనత డాక్టర్‌ బీఎస్‌ రావుకు దక్కుతుంది. కేవలం వాణిజ్యపరంగానే కాకుండా సేవారంగంలో కూడా ముందుండేవారు. 16 ఏళ్లకే మృతిచెందిన కుమారుడు కళ్యాణచక్రవర్తి స్మారకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలను దత్తత తీసుకొని రక్షిత నీరు అందించారు. విపత్తుల సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇతోధికంగా సాయం ప్రకటించేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి అకాల మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. అన్నిరంగాల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !