Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి బిల్లుపై కసరత్తు ముమ్మురం చేసిన కేంద్రం !

0

ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ బిల్లును రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్‌ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం యోచిస్తోంది. 

నెలరోజుల గడువులోనే పూర్తి...పనుల్లో వేగం పెంచిన కేంద్రం.

బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ ఇటీవల ఖజజ గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్‌లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే..  ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది. మరోవైపు జూన్‌ 14వ తేదీనే లా కమిషన్‌ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్‌ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది.

బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్‌ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి.

ఒకే రకమైన చట్టం

ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. 

‘‘వన్‌ నేషన్‌ వన్‌ ఎజెండా’’ 

భారతదేశం భిన్న మతాలు, విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా అలరారుతోంది. అయితే అందరం ఒక్కలాగా ఉండాలి. ఒకే విధంగా జీవించగలగాలి అనే ప్రస్తావన ఇప్పుడు ప్రముఖంగా వినబడుతోంది. దీని గురించి స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి లేదా కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లును తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారణాలు ఎలాంటివి ఉన్నప్పటికీ దేశం మొత్తాన్ని ఏకతాటి పైకి తేవాలి అనేది తమ లక్ష్యం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘‘వన్‌ నేషన్‌ వన్‌ ఎజెండా’’ అనే దానిని తెరపైకి తీసుకొస్తుంది. వచ్చే ఎన్నికలకు ముందు దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నది. దీనిపైన ఇటీవల ప్రధానమంత్రి భోపాల్‌ లో నిర్వహించిన ఒక సభలో కుండబద్దలు కొట్టారు. వేరువేరు చట్టాలతో దేశం ఎలా అపసవ్య దిశలో నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతలో ఉన్న వైవిధ్య భరితమైన సంస్కృతిని దెబ్బతీయడం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఇలాంటి పౌర స్మృతిని తెరపైకి తీసుకురాలేదు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు మనం అనుచరించాల్సిన ఆదేశాలు మాత్రమే నిర్దేశిస్తాయి. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని ఎట్టి పరిస్థితిలో చెప్పవు. ఒకవేళ అలా చెప్పవలసిన అవసరం ఉంటే రాజ్యాంగ రూపొందించే సమయంలోనే ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగంలో భాగమై ఉండేది. ఇక వివిధ రకాల మతాలను ఆచరించేవారు.. తమ మత ఆచారాలకు అనుగుణంగా సంప్రదాయాలు పాటిస్తున్నారు. ముస్లింలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్‌, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్‌ చట్టాలు రూపొందించుకున్నాయి. క్యాథలిక్స్‌, ఇతర మతస్తులకు భిన్నమైన నియమాలు ఉన్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్ళకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాల సవరించారు. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటాహకుని కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని మిగతా మతస్తులు కూడా తప్పుపడుతున్నారని తెలుస్తోంది. అయితే బిజెపి విధానాల ప్రకారం ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌ గానే యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే బిజెపి నాయకుల వాదన. ఇందుకు ఇస్లాం మతంలో ముమ్మారు తలాక్‌ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్‌ ఈనాటిది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 కూడా ఇదే చెప్తోంది. మరి దీనిని అనుసరించి మోడీ మాట్లాడుతున్నారు. ఎన్నికలవేళ దీనిని అమల్లోకి తెస్తామని చెబుతున్నారు. దీనిపై మిగతా పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !