Vijayasai Reddy Counter to Chiranjeevi : చిరంజీవికి విజయసాయిరెడ్డి కౌంటర్‌ !

0

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 డేస్‌ ఈవెంట్‌ లో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చిరంజీవి వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్‌ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో.. ‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్‌ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని తెలిపారు. అలాంటి వారికి హాట్సాఫ్‌.

సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల…ఇదే సమయంలో.. ‘కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్‌ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?

అయితే ఆ వ్యాఖ్యలు చిరంజీవి, అంబటి రాంబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని అందరూ అనుకున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో బయటకి వస్తే గాని తెలియలేదు. చిరంజీవి ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడరని. ఇటీవల పార్లమెంట్‌ లో సినిమాటోగ్రఫీ చట్టం బిల్‌ పాస్‌ చేస్తున్న సమయంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. హీరోల రెమ్యూనరేషన్‌ గురించి వ్యాఖ్యానించాడు.సినిమా బడ్జెట్‌ లో 50 శాతం హీరోల పారితోషకానికే వెళ్ళిపోతుందని, మిగిలిన 50 శాతం సినీ కార్మికులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూనే చిరంజీవి.. ‘‘పార్లమెంట్‌ వంటి సభలో చర్చించేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాటిమాటికి సినిమా పరిశ్రమపై పడతారేంటి పిచుక పై బ్రహ్మాస్త్రంలా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డికి కౌంటర్‌ అని తెలియడంతో ఆయన కూడా సోషల్‌ మీడియా వేదికగా ఇప్పుడు రియాక్ట్‌ అయ్యారు. ఇది ఇలా ఉంటే, చిరంజీవి వ్యాఖ్యలు పై వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్‌ కి మెగాస్టార్‌ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుల పై నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్తుందా అనేది చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !