Aditya L1 : నిండిలోకి ఆదిత్య ఎల్‌1 - ఇస్రో ఖాతాలో మరో విజయం !

0

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్‌1 పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ కేంద్రం నుంచి సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ57 ద్వారా పంపింది. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన 5 నిమిషాల్లో మొదటి రెండు దశలు సజావుగా పూర్తయ్యాయి. అంచనాల ప్రకారమే ప్రస్తుతం రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయాణం మొదలైన 1.03 నిమిషాల తర్వాత పీఎస్‌ఎల్వీ స ీ57 రాకెట్‌ నుంచి ఆదిత్య ఎల్‌1 విడిపోయి నిర్దేశిత కక్ష్యలోకి చేరింది.

ఆదిత్య ఎల్‌1 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడిరచారు. ఆదిత్య ఎల్‌1ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రాకెట్‌ నుంచి ఆదిత్య ఎల్‌1 విడిపోయినట్లు తెలిపిన ఆయన.. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయాణం మొదలైన తర్వాత ఉపగ్రహం భూ దిగువ కక్ష్యలోకి చేరింది. ఆ తర్వాత దాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్‌1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావిత ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూయిజ్‌ దశ ప్రారంభమవుతుంది. ఇలా 125 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్‌1 బిందువును చేరుకుంటుంది.చంద్రుడిపై చంద్రయాన్‌-3ని ల్యాండ్‌ చేసినట్లుగా ఆదిత్యఎల్‌1 ని కూడా సూర్యుడిపై ల్యాండ్‌ చేయడం కుదరదు. గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్‌ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం నాసా కు చెందిన ప్రోబ్‌ కరోనాలోనికి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.

సూర్యుడిపై శోధన కోసం...

మొత్తం 190 కిలోలున్న ఆదిత్య ఎల్‌1.. వీఎల్‌సీ ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరునుబట్టి అది మరింత ఎక్కువకాలం పనిచేసే అవకాశం కూడా ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలోనే సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణం (కరోనా) కనిపిస్తుంది. ఇలాంటి గ్రహణాన్ని వీఈఎల్‌సీ కృత్రిమంగా సృష్టిస్తుంది. సౌరగోళం నుంచి వచ్చే కాంతిని పూర్తిగా మూసేసి.. సూర్యుడి చుట్టూ మసకమసకగా ఉండే కరోనాను నిశితంగా గమనిస్తుంది. వీఈఎల్‌సీ డేటా ఆధారంగా సూర్యుడిలో కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా 24 గంటల్లో సీఎంఈ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఆ సీఎంఈ భూమి దిశగా వస్తోందా? శక్తమంతంగా ఉందా? అనేది తెలుసుకోవచ్చు. వీఈఎల్‌సీని 40 భిన్న దర్పణాలతో రూపొందించారు. సూర్యుడి కరోనాకు సంబంధించి.. అంతరిక్షంలోని ఇతర వ్యోమనౌక కంటే మెరుగైన ఫోటోలను ఇది అందిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో పాలిష్‌ చేసిన ప్రాథమిక దర్పణమే ఇందుకు కారణం. ఇది వీఈఎల్‌సీ లోపల కాంతి వికిరణాన్ని తగ్గిస్తుంది.

భానుడి గుట్టువిప్పేందుకు...

హైడ్రోజన్‌, హీలియంతో కూడిన సూర్యుడు.. భూమిపై జీవులకు మూలాధారం. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి.. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత, వేడి, ఉష్ణ రేణువుల ప్రభావం భూమిపై ఉంటుంది. భానుడి నుంచి నిరంతరం ప్రవహించే రేణువులను సౌరగాలిగా పేర్కొంటారు. అందులో శక్తిమంతమైన ప్రొటాన్లు ఉంటాయి. సౌర కుటుంబం మొత్తం ఈ గాలితోపాటు సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఆవరించి ఉంటుంది. అయస్కాంత క్షేత్రాల్లో మార్పుల కారణంగా సౌర తుపాన్లు చెలరేగుతాయి. వీటి వల్ల సూర్యుడి నుంచి సోలార్‌ ఫ్లేర్స్‌, ప్లాస్మా, ఆవేశిత రేణువులు అంతరిక్షంలోకి దూసుకొస్తుంటాయి. ఇలాంటి పరిణామాల్లో ప్రధానమైనది కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ). దీన్ని సౌర తుఫానుగా కూడా పేర్కొంటారు. దీనివల్ల కోట్ల టన్నుల మేర సౌర పదార్థాలు సెకనుకు 3వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంటాయి. వీటిలో కొన్ని భూమి దిశగా రావొచ్చు. ఈ నేపథ్యంలో ఆదిత్య ఎల్‌1 అందజేసే డేటా ఈ ముప్పును ముందుగానే పసిగట్టి.. ప్రమాదం నుంచి తప్పించుకోడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !