Chandrayaan-3 : చంద్రయాన్‌-3 కథ ముగిసినట్లేనా ?

0

 

చంద్రయాన్‌ `3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు ఇంకా పనిచేసే పరిస్థితి కనిపించటం లేదు. సెప్టెంబర్‌ 22న చంద్రుడిపై సూర్యోదయమైనప్పటికీ ల్యాండర్‌, రోవర్‌లు ఇంకా స్పందించటం లేదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాటిలో కదలికలో కోసంఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై స్పందించారు. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు మేల్కొవడంపై ఇక ఆశ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. 

ఇప్పటికే విలువైన సమాచారం అందింది !

ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేది. ఇక అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు’’ అని స్పేస్‌ కమిషన్‌ మెంబర్‌ అయిన ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. ‘‘చంద్రయాన్‌-3ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చింది. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ కాలుమోపింది. ఇప్పటికే ఆ రీజియన్‌ నుంచి విలువైన సమాచారం మనకు అందింది. ఇది కచ్చితంగా ఉపయోగపడే సమాచారం. తదుపరి చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్‌ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది’’ అని అన్నారు. చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చే అవకాశాలపై కిరణ్‌ కుమార్‌ స్పందించారు. భవిష్యత్తులో ఇది సాధ్యం కావచ్చని పేర్కొన్నారు. సాంకేతిక సామర్థ్యాలు పెరగడం వల్లే చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ జరిగిందన్నారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయన్నారు. టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. కాగా భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువం చేరడంతో ఇస్రో కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !