KTR : 3 హామీల సంగతేంటి ?

0

  


ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘మా 3 ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ 3 విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? గుండెల్లో గుజరాత్‌ పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు. మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు.

పసుపు బోర్డ్‌ ఎన్నికల స్టంట్‌ !

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్‌ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు. పెట్రోల్‌ ధరలు నియంత్రిస్తాం అన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..? మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్‌ మాదిరిగానే ఉంది. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో... అదానికి తప్ప.. ఆమ్‌ ఆద్మీకి దక్కిందేంటి..! మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా...! మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !