Party Supporters : ఓడిపోతున్న కార్యకర్త !

0

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తే వెన్నుముక. పార్టీ అధికారంలోకి రావాలన్నా, పదికాలాల పాటు అధికారాన్ని చలాయించాలన్నా కార్యకర్తలదే ప్రధాన పాత్ర. కానీ పార్టీ మనుగడకు కారణమువుతన్న కార్యకర్త ఓడిపోతున్నాడు. కష్టం కార్యకర్తలది, భోగం నాయకులది అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా, కుటుంబానికి దూరం అయ్యి, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ, జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ, బ్యానర్లు, ఫ్లెక్లీలు కడుతూ, నలుగురిని కూడకట్టుకుని నాయకులకు భుజానికి ఎత్తుకుని జై కొడితే...కార్యకర్తలకు మిగిలుతున్నది ఏమిటి ? దక్కుతున్నది ఏమిటి ? పార్టీలన్నీ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారు. అసలు కార్యకర్త అనే వాడు జెండా పట్టుకోకుంటే పార్టీలకు ఉనికి ఎక్కడిది ? పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, పార్టీనే నమ్ముకుని, పార్టీ కోసం సర్వస్యం త్యాగం చేసిన ఎందరో కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేక, ఎప్పటికీ కార్యకర్తగానే మిగిలిపోతున్నాడు. 

ఎన్ని రోజులు నాయకుల పల్లకీలు మోయాలి ?

పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడికి సపోర్ట్‌ చేస్తున్నారు అనుకోండి, ఓకే. నో ప్లాబ్లమ్‌. ఒక సారి ఓకే, రెండో సారి పర్లేదు, మూడోసారి, నాలుగోసారి, ఆ తర్వాత ఆయన కోడుకు /కూతురు పోటీ. పార్టీ ఏదైనా రెండోసారి, ఎన్ని రోజులు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని నెత్తిన పెట్టుంకుంటారు. నీ నాయకుడిని నీవు మోయడం వల్ల నీకు ఓరిగిందేమిటి ? నాయకులు అందరూ కార్యకర్తల భుజాలనే మెట్లుగా మార్చుకుని పదవులు అనుభవిస్తున్నారు. మరి కార్యకర్తలు సంగతి ఏంటి ? సీట్లు, పదవులు అన్నీ నాయకులే తీసుకుంటే మరి కార్యకర్తలు నాయకులుగా ఎదిగేదెప్పుడు ? తరాలు మారినా కార్యకర్తలు కార్యకర్తలుగా ఉండిపోవాలా? నాయకుల పల్లకీలు మోస్తూనే ఉండాలా ? ఇంకెప్పుడు ఇస్తారు కార్యకర్తలకి అవకాశాలు ? కార్యకర్తల స్థాయి నుండి కనీసం 5% మంది కూడా నాయకులుగా ఎదగలేకపోతున్నారు. ఇంకెంతకాలం ఈ దౌర్భాగ్యం. కార్యకర్తలారా...ఆలోచించండి. డబ్బు, సమయం వృధా చేసుకోకండి. ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు వెళితే మీ కుటుంబాలకు కనీస గౌరవ మర్యాదలు దక్కుతాయి. 

డబ్బు ఉన్నోళ్లకే రాజకీయాలు !

అవునన్నా కాదన్నా రాజకీయాలు డబ్బు చూట్టూనే తిరుగుతున్నాయి. డబ్బు ఉన్నోళ్ళకే పరిమితం అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. డబ్బులేని సామాన్య కార్యకర్తలు పార్టీనే నమ్ముకుని మోహమాటం, పరువు కోసం పాకులాడుతూ ఒక్క పార్టీనే అంటి పెట్టుకుని ఉండిపోతే, డబ్బున్న ద్వితీయ శ్రేణి నాయకులు అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరి తమ ప్రాబల్యంతో సామాన్య కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారినంత ఈజీగా కార్యకర్తలు జెండాలు మార్చలేకపోతున్నారు. అధికార పక్షం అయినా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా డబ్బులేని సామాన్య కార్యకర్తకు అసలు విలువ లేదు. గుర్తింపు లేదు. అనుభవంలోకి వస్తే తప్ప, యువ కార్యకర్తలకు విషయం బోధపడటం లేదు. అనుభవం అయ్యేలోపు సమయం అంతా వృధా. అలాంటప్పుడు ఓ కార్యకర్తా...నీకేందుకు ఈ అనవసరపు ఆరాటం, కేవలం వృధా ప్రయాసే. పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఎలాంటి గుర్తింపు లేక పార్టీలకు దూరంగా ఉంటున్న కార్యకర్తలు ఎందరో. పార్టీల కోసం పోరాడినందుకు వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు. కనీసం ఇప్పటికైనా గ్రామ స్థాయిలోనూ నిజాయితీపరులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లులను ఎంత దూరం పెడితే పార్టీలు అంత బాగుంటాయి అనటంలో సందేహం లేదు. 

మళ్ళీ వీళ్లేనా ? 

నిన్నటి దాకా అధికార పార్టీలో అధికారం, పదవులు అనుభవించిన నాయకులు ఆ పార్టీ ఓడిపోతుంది అంటే చాలు గెలిచే పార్టీ వైపు నిసిగ్గుగా గోడ దూకేస్తున్నారు. దీని కోసం ఈ పార్టీ, ఆ పార్టీ అనే భేధం లేదు. అన్ని పార్టీల్లో ఇదే వరుస. కార్యకర్తలారా ! ఓటరు మహాశయులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పార్టీలో సీటు లేని వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీలో టికెట్టు ఇవ్వకపోతే ఆ పార్టీలోని..అసలు ఏ పార్టీలో టికెట్టు వస్తే ఆ పార్టీలోకి...టికెట్టు మీద గెలిస్తే...గెలిచిన పార్టీలోకి దూకేకటం...అభివృద్ధి కోసం అంటూ ముసలికన్నీరు కార్చటం. ఇక్కడ ఒక్క విషయం గమనించండి, వీళ్ళందరూ మనకు తెలిసిన, సుపరిచితమైన నాయకులే. ఒక్కరూ కూడా కొత్త నాయకులు ఉండరు. ఎన్నికల్లో నీతి, నిజాయితీ ఉన్న పాత వాళ్ళను కచ్చితంగా గెలిపించాల్సిందే. ఇక పోతే గెలిచి సొంత ప్రయోజనాల కోసం పాకులాడే నాయకులను సాగనంపాల్సిన కొత్త చరిత్రను నాంది పలకాల్సిన అవసరం ఓటర్లకు వచ్చింది. ఈ సారి పార్టీలతో సంబంధం లేకుండా నిజాయితీ ఉన్న నాయకులను ఎన్నుకోవలసిన అవసరం ఉంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !