Telangana Elections : ఓడిపోతే కేసీఆర్‌ని కేటీఆర్‌ వృద్ధాశ్రమంలో చేర్చుతారు

0


పాలమూరు ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మంత్రి కేటీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కేసిఆర్‌ను కేటీఆర్‌ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 3 తారీఖు నాడు కేసీఆర్‌ మాజీ సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పారు. ఈసారి కమలం పువ్వుకు ఓటు వెయ్యకపోతే పేదలను ఎవరు కాపాడలేరన్నారు.పేపర్‌ లీకేజ్‌ కోసం తాను పోరాడితే తనను పోలీసులు గొడ్డును లాక్కుపోయినట్లుగా లాక్కుపోయారని అన్నారు. నామీద 74 కేసులు ఉన్నాయన్నారు. మీ కోసం మేం మా బతుకులు నాశనం చేసుకున్నామన్నారు. మీరంతా సినిమాలు చూస్తు ఎంజాయ్‌ చేస్తే మేమంతా మీకోసం పోరాడుతున్నామన్నారు. మీరు హోటల్స్‌ కు వెళ్తే..మేము మా కుటుంబానికి దూరమై మీకోసం పోరాడతున్నామని అటువంటి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. పాలమూరు మంత్రి కబ్జాలు, దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించారని..ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని తమపై కేసులు పెడుతున్నారు అంటూ విమర్శించారు.

ఎవరూ సిఎం అయినా మరోకరు ఊరుకోరు !

రేవంత్‌ రెండ్డి ముఖ్యమంత్రి అయితే ఉత్తమ్‌ ఊరుకుంటారా ? ఉత్తమ్‌ ముఖ్యమంత్రి అయితే రాజగోపాల్‌ ఊరుకుంటారా ? అంటూ కాంగ్రెస్‌ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే.. కవిత ఊరుకుంటుందా..? కవిత ముఖ్యమంత్రి అయితే హరీష్‌ రావు ఊరుకుంటారా..?అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ల నిర్మాణాల్లో కమీషన్లు తిన్నారు అంటూ ఆరోపించారు. కేసీఆర్‌ ముస్లిం మహిళల బతుకులు బార్బత్‌ చేస్తున్నారు అంటూ విమర్శించారు. ఎంఐఎం.ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు టోపీలు పెట్టుకొని నమాజ్‌ లు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.12% ఓట్ల కోసం పాకులాడుతున్నారని..80% ఉన్న హిందూ సమాజం జాగృతం కావాలి అంటూ పిలుపునిచ్చారు. తప్పిపోయి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా బొట్టు పెట్టుకొని, కంకణం కట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదన్నారు.తాను కూడా కరసేవకు వెళ్లానని..పాలమూరులో మిథున్‌ రెడ్డి నీ గెలిపిస్తే ఇక్కడ కూడా కర సేవ చేస్తానని అన్నారు. ఓట్ల కోసం మసీద్‌ కు టోపీ పెట్టుకొని నటిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు..మసీదుల్లో అల్లాను మొక్కడం లేదు, రాముడిని, సీతమ్మను మొక్కుకున్నారు..అల్లాను అగౌరవ పరుస్తున్నారు.. మసీద్‌ ను అపవిత్రం చేస్తున్నారు అంటూ బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !