Hyderabad : మోదీ పొలిటీకల్‌ గేమ్‌...కాంగ్రెస్‌ వినూత్న ప్రచారం.

0

హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కాంగ్రెస్‌ పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మరియు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీలను తోలుబొమ్మలుగా చేసుకుని మోడి ఆడిస్తున్నట్లు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ వేసి హైద్రాబాద్‌ నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సిటీ నడిబొడ్డున.. పంజాగుట్ట సెంటర్‌ లో వెలిసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. అతిక్రమించి.. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీన్ని గమనించిన బీఆర్‌ఎస్‌ నేతలు కంప్లయింట్‌ చేయటంతో.. దాన్ని వెంటనే తొలగించారు.

తోలుబొమ్మలాటతో ఆకట్టుకునేలా 

తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ప్రభావం చూపుతుందన్న కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలకు ప్రతీకగా రాజకీయ నేతలకు సంబంధించిన వివరణాత్మక మరియు వ్యంగ్య చిత్రాలతో కూడిన బొమ్మలతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలనే ఉద్ధేశ్యంతో కాంగ్రెస్‌ ఈ ప్రచారానికి తెరలేపింది. బిజెపి, దాని మిత్రపక్షాలు బిఆర్‌ఎస్‌ మరియు ఎఐఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయన్న కాంగ్రెస్‌ వాదనను హైలైట్‌ చేస్తూ, కెసిఆర్‌ మరియు ఒవైసీ ఇద్దరికీ అతుక్కొని ఉన్న తీగలను పిఎం మోడీ నియంత్రిస్తున్నట్లు తోలుబొమ్మలు చూపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ తెరవెనుక పొత్తులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ స్థిరంగా ఆరోపిస్తోంది, తోలుబొమ్మలాట వ్యవస్థ ఈ కథనానికి దృశ్యరూపంగా మార్చి తెలంగాణ రాజకీయ రంగాన్ని మోదీ కీలుబొమ్మ చేసి ఆడిస్తున్నారని మేసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళుతోంది.

సోషల్‌మీడియాలో వైరల్‌

సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. కొంతమంది రాజకీయ వ్యాఖ్యానానికి సృజనాత్మక విధానాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ చర్యను కేవలం ప్రచార స్టంట్‌ అని విమర్శించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !