Modi : టల్నెల్‌ బాధితులతో మోదీ...ధైర్యానికి హ్యాట్సాఫ్‌

0

ఉత్తర్‌కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లుతెత్తున్నాయి. 17 రోజుల పాటు సొరంగంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ కూలీలు.. మంగళవారం రాత్రి ఎట్టకేలకు బాహ్య ప్రపంచాన్ని చూశారు. వారు బయటకు రాగానే తమను కాపాడిన సహాయక సిబ్బంది, అధికారులకు చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్‌ లో ముఖ్య పాత్ర పోషించిన ఆర్మీ(రిటైర్డ్‌) అధికారి వీకే సింగ్‌ సేవల్ని కొనియాడారు. పక్షం రోజులకు పైగా మొక్కవోని ధైర్యంతో ఆశలు కోల్పోకుండా నిరీక్షించి కార్మికుల తెగువను ప్రశంసించారు. కార్మికులందరికీ కేదార్‌ నాథ్‌, బద్రీనాథ్‌ ఆశీస్సులు ఉన్నాయని.. అందుకే క్షేమంగా బయటపడినట్లు వ్యాఖ్యానించారు. కూలీల అసాధారణ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యోగా, మార్నింగ్‌ వాక్‌తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. ‘‘మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడిరది. దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. యోగా, మార్నింగ్‌ వాక్‌ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నాం’’ అని బిహార్‌కు చెందిన ఓ కూలీ ప్రధానితో అన్నారు.

శిథిలాలు కూలగానే..

నవంబరు 12న సొరంగంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా శిథిలాలు పడ్డాయి. అప్పుడే మేం ఇందులో చిక్కుకుపోయామని అర్థమైంది. తొలి 10-15 గంటలు చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టి మేం ఉన్న ప్రాంతం వరకు ఓ గొట్టాన్ని పంపించారు. దాని నుంచి అన్నం, పప్పు, డ్రైఫ్రూట్స్‌ వంటివి మాకు అందించారు. మేము చిక్కుకుపోయిన చోట ఓ మైక్‌ను అమర్చడంతో మా కుటుంబసభ్యులతోనూ మాట్లాడగలిగా. సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉంది’’ అని విశ్వజీత్‌ కుమార్‌ వర్మ అనే కార్మికుడు సంతోషం వ్యక్తం చేశారు.

నమ్మకాన్ని కోల్పోలేదు..

తొలుత కొన్ని గంటలు చాలా ఇబ్బందిపడ్డాం. ఊపిరి కూడా తీసుకోలేకపోయాం. కానీ, ఆ తర్వాత మాకు బాహ్య ప్రపంచంతో కాంటాక్ట్‌ అందింది. నాటి నుంచి పరిస్థితులు సాధారణంగా మారిపోయాయి. సొరంగంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. మేం ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కార్మికుడు విశాల్‌ తెలిపారు.

నిషేధించిన విధానమే కాపాడిరది

అనేక మార్గాలు అనుసరించినా, ఆలోచించినా, ఉత్తరాఖండ్‌ సొరంగంలోని కూలీలను రెండు వారాలు బయటకు తీసుకురాలేకపోయారు. కానీ, ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌తో ఒక్క రోజులోపే ఫలితం వచ్చేసింది. వాస్తవానికి అశాస్త్రీయం, సురక్షితం కాదంటూ ఈ పద్ధతిపై 2014లో ఎన్జీటీ నిషేధం విధించింది. ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌.. 4 అడుగుల వెడల్పు మించని ప్రదేశంలో బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో నిపుణులు. ఒక్కరు మాత్రమే పట్టే ఈ మార్గంలో బొగ్గు లేయర్‌ను చేరాక.. సొరంగం తవ్వడం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ప్రత్యేకత. ఇది ఎలుక తవ్వే కందకాన్ని పోలి ఉంటుంది కాబట్టి ర్యాట్‌ హోల్‌ అనే పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో పిల్లలతో ఈ పని చేయిస్తున్నారు. పర్యావరణ కోణంలోనూ దీనిని ఎన్జీటీ నిషేధించింది.

ప్రస్తుతం 41 మంది కూలీలు ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడిరచారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వారిని ఎయిమ్స్‌ దేహ్రాదూన్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, క్షేమంగా ఉన్నారని స్పష్టమైన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !