YS Jagan : ‘‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’’..దేశానికే తలమానికం !

0


బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్‌ మాట్లాడారు. సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడి విగ్రహం విజయవాడలో ఆవిష్కృతమైందన్నారు. బాబా సాహెబ్‌ మన భావాల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చెప్పారు. మన అడుగుల్లో ఆయన ఎప్పటికీ కనిపిస్తారని అన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్‌ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అన్నారు. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందన్నారు. పెత్తందారి, అంటరానితం, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెళ్లపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో 75వ రిప్లబిక్‌ డేకు సరిగ్గా వారం రోజుల ముందు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. పేదలు, మహిళలు, మానవ, ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి నిస్తుంది. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయన విగ్రహం చూసినప్పుడల్లా మనకు కనిపిస్తూనే ఉంటారు.రాజ్యాంగ హక్కులు, న్యాయాల ద్వారా మనల్ని నిరంతరం కాపాడే ఒక మహా శక్తిగా ఆయన మనందరికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. గొంతు వినిపించలేని అట్టడగువర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి కారకులు అంబేద్కర్‌. నేడు దళిత జాతి నిలబడిరదంటే వారికి అంబేద్కర్‌ రిజర్వేషన్లు కల్పించడమే కారణం. దళితులను ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌. ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్‌. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఉందని విన్నాం. ఇక స్టాచ్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే విజయవాడ పేరు మారుమోగుతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ ప్రత్యేకతలు ఇవే !

రాత్రి సమయంలో ప్రత్యేక ఆకర్షణతో లైటింగ్‌ 

రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్‌ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 19న ఆవిష్కరించారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.

18.18 ఎకరాల్లో.. రూ.404 కోట్లతో..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్‌ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్‌, వాటర్‌ బాడీస్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. 



విగ్రహం బేస్‌ కింది భాగంలో.. 

గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు ఉంటాయి.  ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతద్యేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.



అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢల్లీి నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్‌) మ్యూజియంను 75 మంది సీటింగ్‌ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించా­రు. ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్‌, వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్‌, వాటర్‌ ఫౌంటేన్‌, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్‌, బబ్లింగ్‌ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడి ఉంటాయి.  కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్‌)ను రూపొందించారు. విగ్రహ పీఠం లోపల జి ప్లస్‌ 2 అంతస్తులను ఐసోసెల్స్‌ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్‌ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగించారు.  అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢల్లీి, బిహార్‌, రాజస్థాన్‌ నుంచి వచ్చిన 500%--%600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !