Hyderabad : అబిడ్స్‌లో హైటెక్‌ వ్యభిచారం.. రామ్‌నగర్‌ అఖిల్‌ పహిల్వాన్‌ అరెస్ట్‌..!

0

  • అబిడ్స్‌లోని ఫార్చ్యున్‌ హోటల్‌లో వ్యభిచారం
  • గుట్టుచప్పుడు కాకుండా దందా

హైదరాబాద్‌లో స్పాలు, థెరపీ, సెలూన్‌ సెంటర్ల ముసుగులో వ్యభిచారాలకు పాల్పడుతున్న పలువురుని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మరో భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. గుట్టు చప్పుడు కాకుండు హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్‌ ఫార్చ్యూన్‌ హోటల్‌పై దాడి చేసిన సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.. వ్యభిచారం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ పహిల్వాన్‌ నేతృత్వంలో ఈ వ్యభిచారం నడుస్తోన్నట్లు తెలిసింది. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను హైదరాబాద్‌కు రప్పించి వారితో గుట్టుగా వ్యభిచారం చేయస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే అఖిల్‌ పహిల్వాన్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అఖిల్‌తో పాటు 16 మంది అమ్మాయిలు, నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లు, లాడ్జీ యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్దనున్న 22 సెల్‌ ఫోన్‌లను సీజ్‌ చేశారు. పట్టుపడిన యువతులను కోల్‌కతా, ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి రప్పిస్తున్నారు నిర్వాహకులు. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడిరది. యువతులను స్టేట్‌ హోమ్‌కు తరలించగా.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సమాజసేవ చేస్తున్నట్లు కలరింగ్‌ !

సమాజసేవ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కలరింగ్‌. కానీ అసలు చేసేది దగుల్భాజీ వ్యాపారం. అఖిల్‌ పహిల్వాన్‌ అనే పేరు హైదరాబాద్‌లో ఉండే చాలామందికి తెల్సు. బోనాల జాతర సందర్భంగా ఇతగాడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తొట్టెల ఊరేగింపు అప్పుడు చిన్నా చితక సినిమావాళ్లను పిలిచి హడావిడి చేస్తుంటాడు.  అయితే అఖిల్‌ పహిల్వాన్‌ ముఠా ఆగడాలు ఒక్కొట్టిగా వెలుగులోకి వస్తున్నాయి. సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు గురువారం హైదరాబాద్‌ అబిడ్స్‌లో తనిఖీలు చేయగా.. ఫర్ట్యూన్‌ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోతైన విచారణ చేయగా అఖిల్‌ పహిల్వాన్‌ పేరు తెరపైకి వచ్చింది. రామ్‌నగర్‌ అఖిల్‌ పహిల్వాన్‌ నేతృత్వంలో ఈ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడి గత రికార్డులను అబిడ్స్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడి ఫోన్‌లో జాతీయ. అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 కాల్స్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎలాంటి ఫ్రూప్స్‌ ఇవ్వకుండా గత 25 రోజులుగా అమ్మాయిలతో ఫార్చ్యూన్‌ హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. ఫార్చ్యూన్‌ హోటల్‌ మొత్తం 25 రూములు ఉండగా.. 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నారు. అఖిల్‌ పహిల్వాన్‌కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. వారికి కూడా అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !