Maldives : భారత ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు !

0


లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవులు ఎంపీ జహీద్‌ రమీజ్‌ తన అక్కసును వెళ్లగక్కారు. పర్యాటకంగా తమతో పోటీపడటం భ్రమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే.. లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్‌ చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అంటూ ఇటీవల లక్షద్వీప్‌లో ప్రధాని పర్యటించిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ జహీద్‌ రమీజ్‌ చెప్పడం ట్వీట్‌ చేశారు. మాల్దీవులు అందించే సేవలను అక్కడ ఎలా అందించగలరని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అక్కడ పరిశుభ్రంగా ఎలా ఉంచగలరని.. అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య అని జహీద్‌ రమీజ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే మాల్దీవులు ఎంపీ జహీద్‌ రమీజ్‌ చేసిన ట్వీట్‌పై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పర్యాటకంగా మాల్దీవులను బహిష్కరించాలని కామెంట్లు పెడుతున్నారు. భారత్‌ నుంచి ఏటా చాలా మంది మాల్దీవుల్లో పర్యటిస్తుంటారు.. భారత్‌ను మాల్దీవులు ఎంపీ అవమానించినందుకు గానూ వారు మాల్దీవుల్లో పర్యటించడం ఆపేసి ప్రత్యామ్నాయ ప్రాంతాలకు వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొంతసేపు అక్కడి బీచ్‌లో సందడి చేశారు. సముద్రంలో స్నార్కెలింగ్‌ చేసిన మోదీ.. సాహసాలు చేయాలనుకునే వారు.. తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని సూచించారు. అంతే కాకుండా లక్షద్వీప్‌లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ప్రధాని లక్షద్వీప్‌లో పర్యటించడంతో అక్కడి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మంత్రులపై వేటు 

భారత్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్‌కాట్‌ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్‌ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న భారతీయులు.. తమ టూర్‌లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు.. భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్‌ తాజాగా వెల్లడిరచారు. షియూనా, మాల్షా, హసన్‌ జిహాన్‌ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. 

బాయ్‌కాట్‌ మాల్డీవ్స్‌ 

షియూనా, మాల్షా, హసన్‌ జిహాన్‌ సోషల్‌ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత్‌ లక్ష్యంగా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మాల్దీవులుకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్‌ మీడియాలో గట్టిగా కౌంటర్‌ ఇస్తున్నారు. నెటిజన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఫోటోలు వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్‌పై, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇక మాల్దీవుల మంత్రి మరియం షియునా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్‌ వేదికగా నరేంద్ర మోదీని క్లౌన్‌ జోకర్‌, తోలుబొమ్మగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !