YSRCP : వైసీపీలో టికెట్టు రాని ఎమ్మేల్యేల ఆవేదన !

0


వైసీపీలో టిక్కెట్‌ కేటాయింపులు పార్టీకి తలనొప్పిని తెచ్చి పెట్టేలా ఉన్నాయి. టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు రాజీనామాలు చేశారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా ఆమె వైఎస్‌ జగన్‌ పై మాటల దాడికి దిగారు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయానని.. శింగనమల నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు.

నిధులు కేటాయించకుండా...

వైఎస్‌ జగన్‌ తన నియోజకవర్గానికి నిధులు ఏమీ కేటాయించలేదన్నారు. జగన్‌ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుచుకంటున్నారని అన్నారు. తనకు టిక్కెట్‌ కేటాయించడం లేదని ముఖ్యమంత్రి జగన్‌ తనతో చెప్పారన్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నిధులు ఏమాత్రం ఇవ్వలేదని జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. తన పట్ల, తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివక్ష చూపారన్నారు. తనకు టిక్కెట్‌ కేటాయించాలని కోరినా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ఏమీ చేయలేకపోయా...

ఈ ఐదేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగా తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు కూడా విడుదల చేయడం లేదన్నారు. హెచ్‌ఎస్‌బీసీ కాల్వ ద్వారా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు చెప్పినట్లే నీటి విడుదల జరుగుతుందని ఆమె అన్నారు. వారి నియోజకవర్గాలకే నీరు విడుదల చేసుకుంటూ ఎస్సీ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తుందని ఆమె ఫైర్‌ అయ్యారు. తాను రెడ్డి సామాజికవర్డం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేను కాలేదని జొన్నలగడ్డ పద్మావతి స్పష్టం చేశారు.

ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారా?

‘‘శింగనమల చెరువుకు నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తోంది. నీటికోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా స్పందించిన దాఖలాలు లేవు. సీఎం ఆఫీసుకు వెళ్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. శింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా?వరదలొస్తే నీళ్లు ఇస్తారా? ఎస్సీ నియోజకవర్గమంటే అంత చిన్న చూపా?ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి?దీనిపై ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారా?ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా?అందరూ కలిసిరండి.. నీటి కోసం పోరాడదాం’’ అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !