Bhashyam Ramakrishna : గుంటూరు బరిలో భాష్యం ?

0

గుంటూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెరపైకి కొత్త పేర్లతో పాటు రేపోమాపో అధిష్టానం ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించించేందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి ఈసారి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి భాష్యం రామకృష్ణ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రకటనే తరువాయి అన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక పెదకూరపాడు నియోజకవర్గం నుండి భాష్యం ప్రవీణ్‌ పేరు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం అభ్యర్థులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక రికార్డు నమోదు కానుంది. ఒకే గ్రామం, ఒకే సామాజికవర్గం నుండి ఇద్దరు వ్యక్తులు పోటీ పడటం ఒక రికార్డుగా చెప్పవచ్చు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !