Farmers Protest : రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగం ! ఉత్కంఠగా దిల్లీ సరిహద్దులు !

0

రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హరియాణా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు  కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి. మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్‌ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పటియాలా డిప్యూటీ కమిషనర్‌ షౌకత్‌ అహ్మద్‌.. అంబాలా డీసీకి లేఖ రాశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికైతే డ్రోన్ల కదలికలు ఆగిపోయాయని అహ్మద్‌ బుధవారం వెల్లడిరచారు.

కనీస మద్దతు ధరకు చట్టబద్దత !

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు  చేపట్టిన ‘దిల్లీ చలో’ మంగళవారం రణరంగమైన విషయం తెలిసిందే. రైతులు. పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బారికేడ్లను ధ్వంసం చేసుకుని నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు డ్రోన్‌ సాయంతో బాష్ప వాయువును ప్రయోగించారు. రెండోరోజు శంభు సరిహద్దులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు. హరియాణా పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని పేర్కొన్నారు. ఇలా టియర్‌ గ్యాస్‌ కోసం డ్రోన్లను వాడడం ఇదే తొలిసారి.

సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ !

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’  నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్ధరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. దిల్లీలో 144 సెక్షన్‌ అమలు, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  మంగళవారం దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ, అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా.. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడిరచారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత స్వామినాథన్‌ కుమార్తె మధుర రైతుల ఆందోళనలపై స్పందించారు. ‘‘తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘దిల్లీ చలో’ చేపట్టిన రైతులను అరెస్టు చేసి జైళ్లకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. వాళ్లేం నేరస్థులు కాదు, అన్నదాతలు. వారితో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని తెలిపారు.

రైతులకు కాంగ్రెస్‌ సంఫీుభావం

రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (%Raష్ట్రబశ్రీ Gaఅసష్ట్రఱ%) చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. బుధవారం ఆయన దిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులను కలుస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పంటలకు కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !