Praneeth Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం !

0


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావును విచారిస్తున్న పోలీసులు ఎస్‌ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లాగర్‌ రూమ్‌ లో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు గుర్తించారు. లాగర్‌ రూమ్‌ సిబ్బందికి ప్రమోషన్‌ ఆశ చూపి ప్రణీత్‌ రావు ట్యాపింగ్‌ లో వారి సహాయం తీసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలోనే ఆపరేషన్‌ రహస్యాలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడని తేలింది. అదేవిధంగా ప్రణీత్‌ రావు డైరీలో వందల సంఖ్యలో ఫోన్‌ నంబర్లను పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రణీత్‌ రావును దర్యాప్తు అధికారులు క్రాస్‌ క్వశ్చనింగ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. దాంతోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌ వెనకాల ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

అదుపులో మరో ఇద్దరు పోలీసు అధికారులు 

మరోవైపు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇద్దరు పోలీస్‌ అధికారులను స్పెషల్‌ ఇన్విస్టిగేషన్‌ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ  ప్రణీత్రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కోసం వారిని తీసుకువెళ్లారని తెలుస్తోంది.  ఫోన్‌ ట్యాపింగ్‌ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతుండగా... ఆయన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.  వారిని హైదరాబాద్‌ కు తరలిస్తున్నారు. బేగంపేటలోని ఎస్‌ఐబీ ఆఫీస్‌లో ప్రణీత్‌ రావుకు కేటాయించిన రెండు రూమ్స్‌ నుంచే ఈ సీక్రెట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ప్రణీత్‌ రావు ప్రత్యేకంగా హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌టాప్స్‌ను వినిమోగించినట్లు తెలిసింది. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ వినియోగించారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మొబైల్‌ యాప్స్‌ సహా ఇతర సాఫ్ట్‌వేర్స్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను రాబడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కోసం డబ్బు ఎవరిచ్చారనే సమాచారం కూడా సేకరిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !