YS AVINASH : షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా.

0

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌లో వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్‌ సునీతపై మండిపడ్డారు. షర్మిల తాజాగా చేసిన కామెంట్లకు అవినాశ్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. నేను వైఎస్‌ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలని అవినాశ్‌ రెడ్డి అన్నారు. తమ గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండని చెప్పారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. విజ్ఞత కలిగిన వారెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. అలాంటి మాటలు వినడానికి కూడా బాగోవని చెప్పారు. కాగా, శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో వైఎస్‌ సునీతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. అవినాశ్‌ రెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడపలో వైసీపీ నుంచి అవినాశ్‌ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ షర్మిల బరిలోకి దిగుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !