CM Jagan : వైసీపీ ప్రభంజనం చూసి దేశం మొత్తం షాక్‌ అవుతుంది.

0

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్‌. మే 16న గురువారం ఐ ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌‎లో ఉన్న ఐ ప్యాక్‌ ఆఫీస్‌ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజతలు చెప్పారు. సీఎం జగన్‌ రాక నేపథ్యంలో ఐ ప్యాక్‌ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్‌ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్‌. ఈ నేపథ్యంలో బెంజ్‌ సర్కిల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ లండన్‌ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్‌ శాతం, విజయావకాశాలపై ఐ ప్యాక్‌ ప్రతినిధులతో చర్చించిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే ఐ ప్యాక్‌ టీంతో మాట్లాడిన తరువాత సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూన్‌ 4న ఏపీ ఫలితాలు చూసి దేశమంతా షాక్‌ అవబోతోందన్నారు జగన్‌. ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

గెలుస్తున్నాం...

ఐప్యాక్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మేం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. జూన్‌ 4న రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది’ అని అన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఐప్యాక్‌ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని సంస్థ చేసిన కృషిని కొనియాడారు. 2019లో వైఎస్‌ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయని ఎవ్వరూ నమ్మలేదని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !