AP ELECTIONS : ఆంధ్రప్రదేశ్‌లో కుమ్మేసిన కూటమి !

0

ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు కన్ఫర్మ్‌ అయిపోయింది. కూటమి ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది. దక్షిణ కోస్తాలో తిరుగులేని విజయం దిశగా దూసుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమి కీలక పాత్ర పోషించనుంది. ఇక నగరిలో అయితే టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. రోజా, కొడాలి నాని, అనిల్‌ వంటి కీలక నేతలంతా కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఇంటి బాట పట్టారు. కీలక మంత్రులంతా దాదాపు ఓటమి బాటలోనే ఉన్నారు. ఇప్పటి వరకైతే 18 సీట్లకే వైసీపీ పరిమితమైంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సహాలు మిన్నంటుతున్నాయి. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమలోనూ కూటమి దుమ్మురేపుతోంది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది.

ప్రతిపక్ష హోదా దక్కుతుందా ? 

ఇక ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న ఏంటంటే.. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా? అని. ప్రతిపక్ష హోదాకు కావల్సిన సీట్ల సంఖ్య 18. కానీ వైసీపీ ప్రస్తుతం 13 సీట్లలోనే ముందంజలో ఉంది. 18 దాటలేదంటే కనీసం ప్రతిపక్షంగా కూడా వైసీపీ కొనసాగలేదు. ఆ జిల్లా.. ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఎన్డీఏ కూటమిదే హవా. ఇక టీడీపీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో టీడీపీ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దానిని కూడా బీట్‌ చేసింది. కాగా.. ఏపీలో తొలి ఫలితం వెలువడిరది. రాజమండ్రి రూరల్‌ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50 వేల కోట్ల మెజారిటీతో విజయం సాధించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !