Hero RajTarun : రాజ్‌ తరుణ్‌ మోసం చేశాడని ఆరోపిస్తున్న ప్రియురాలు !

0

యువ నటుడు రాజ్‌ తరుణ్‌ మళ్ళీ వార్తల్లో వున్నాడు, రాజ్‌ తరుణ్‌ పై అతని ప్రేయసిగా చెప్పుకునే లావణ్య అనే అమ్మాయి నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. లావణ్య తన ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని చెపుతోంది. అయితే తామిద్దరూ విడిపోవడానికి ఒక సినీ నటి కారణమని ఇంకో సంచలన ఆరోపణ చేసింది లావణ్య. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది.  ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా నా నెంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి దూరం పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమని తెలిపింది. ఆ నటితో పాటుగా ఆమె సోదరుడిపై కూడా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది లావణ్య. 

తనకి బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయని లావణ్య చెప్పినట్టుగా తెలిసింది. రాజ్‌ తరుణ్‌ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్టుగా చెపుతున్నారు. తాను రాజ్‌ తరుణ్‌ తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెపుతోంది. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం అనీ, కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు అని లావణ్య ఆరోపిస్తోంది. మూడు నెలల క్రితం రాజ్‌ తరుణ్‌ తన ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు అని కూడా అంటోంది. తనకి రాజ్‌ తరుణ్‌ మాత్రమే ప్రపంచం అని, అతను నాకు కావాలి అని చెపుతోంది లావణ్య. తనకి న్యాయం చెయ్యమని చెపుతోంది. గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు అని కూడా చెపుతోంది. అప్పుడు అరెస్టయి 45 రోజులు జైల్లో వున్నాను అని చెపుతోంది. ఆ సమయంలో రాజ్‌ తరుణ్‌ నుండి తనకు ఎలాంటి సాయం రాలేదు అని ఆరోపిస్తోంది లావణ్య.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !