Revanth Reddy : డ్రగ్స్‌, హైడ్రా....రేవంత్‌ నెక్ట్‌ టార్గెట్‌...విద్యారంగమేనా ?

0
నాయకుడు సరైనోడు ఉంటే వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేస్తాయి అనేందుకు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఉదాహరణగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన వెంటనే డ్రగ్స్‌,గంజాయిపై ఉక్కుపాదం మోపి సాహసోపేతమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బృందాలతో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్‌, గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైద్రాబాద్‌ రేవంత్‌రెడ్డి పుణ్యమా అని ఇప్పుడిప్పుడే ఆ పేరును తొలగించుకుంటోంది. అదే కోవలో గత కొద్ది రోజులుగా హైడ్రా పేరుతో భూ ఆక్రమణ దారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్ని కజ్జా కోరల నుండి విడిపిస్తున్నారు. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాబోయే 30`40 ఏళ్ళు ఎవరూ కబ్జాల జోలికి పోరు, పోతే రేవంత్‌రెడ్డి లాంటి ఒక్క ముఖ్యమంత్రి వచ్చినా చాలు మొత్తం కూలిపోతుంది అనే భయం ఆక్రమణదారుల్లో పుట్టించారు. ఇది కేవలం నిజాయితీకి ఉండే ధైర్యమే అని చెప్పాలి. అయితే ఆయన తర్వాత టార్గెట్‌ ఎవరు ? ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ అని తెలుస్తోంది. దీని కోసం సమర్థుడైన అధికారిని వెతికి విద్యరంగాన్ని పూర్తి ప్రక్షాళణ చేస్తూ హైడ్రా మాదిరిగా పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రైవేటు హాస్పిటల్స్‌ దోపిడీపైని నియంత్రించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డి సంస్కరణలు అని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా...

హైడ్రా తరహాలోనే విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిజాయితీగల అధికారులను వెతికే పనిలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇవి రేవంత్‌రెడ్డి సంస్కరణలు అని చెప్పుకునే విధంగా అన్ని వ్యవస్థలను సరిదిద్దే లక్ష్యంతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన శాఖల్లో దశాబ్దాలకాలంలో తిష్టవేసిన నిర్లిప్తత, నిర్లక్ష్యాన్ని పారద్రోలి వ్యవస్థలకు, అధికారులకు ఒక కొత్త గైడ్‌లైన్స్‌ని సెట్‌ చేసే పనిలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. నిజాయితీ గల అధికారులకు ఆన్‌లిమిటెడ్‌ పవర్స్‌ ఇస్తే వ్యవస్థలో చైతన్యంతో పాటు మార్పు ఎలా ఉంటుందో రేవంత్‌రెడ్డి చూపించబోతున్నారు. హైడ్రా మాదిరిగానే విద్యారంగాన్ని సంస్కరించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీ ఫీజలు దోపిడీ నుండి మొదలుకొని అనుమతులు లేని స్కూల్స్‌, కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలకు పూనుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్స్‌లో పనిచేసే అర్హత కలిగిన టీచర్లకు కనీస వేతనంతో అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి స్కూల్‌, కాలేజీలో అర్హులైన ఉపాధ్యాయులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి స్కూల్‌ని ఆన్‌లైన్‌ చేయటంతోపాటు ఫీజలును ఆన్‌లైన్‌లోనే కట్టేలా సంస్కరణలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒక విద్యాసంస్థ పేరుతో ఒకే స్కూల్‌ / కాలేజ్‌ నడిచేలా నిబంధనలు మార్చబోతున్నట్లు తెలుస్తుంది. సొసైటీలు/ ట్రస్ట్‌ల పేరుతో నడిచే స్కూల్స్‌ మరియు కాలేజీలపై ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీల్లోకి నిధులు మళ్ళించకుండా గట్టిచర్యలు తీసుకోబోతున్నారు. సొసైటీ / ట్రస్ట్‌ల్లోని సభ్యులు వేరే ఇతర లాభదాయక కంపెనీల్లో భాగస్వాములు కాకుండా కఠిన నిబంధనలు విధించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !